పార్టీ జెండా మోసిన వారికే అన్ని పదవులు

జంగా రాఘవ రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్

పార్టీ జెండా మోసిన వారికే అన్ని పదవులు

బెల్లంపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
బెల్లంపల్లి పట్టణంలోని ఆర్‌పి ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

“పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారికే కాంగ్రెస్‌లో అన్ని రకాల పదవులు లభించనున్నాయి,” అని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి కష్టసమయంలో అండగా నిలిచిన కార్యకర్తలే విజయానికి అసలైన బలం అని గుర్తు చేశారు. నిబద్ధత చూపిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను తెలుసుకొని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు. గ్రామ, మండల కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. 
“జై భీమ్ – జై బాపు – జై సంవిధాన్” నినాదాలతో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. సమావేశంలో కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించబడినాయి.WhatsApp Image 2025-04-28 at 8.12.02 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .