వంగాలపల్లిలో ఘనంగా  బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు

బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ 

వంగాలపల్లిలో ఘనంగా  బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు

 -అనంతరం సభకు తరలివెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు  

చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనగామ జిల్లా చిల్పూర్ మండలం వంగాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి గులాబీ  జెండా ఆవిష్కరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు  అధిక సంఖ్యలో బహిరంగ సభకు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిట్యాల దయాకర్, గ్రామ ఇంచార్జ్ ఆరూరి రవిచందర్ మాట్లాడుతూ,
“తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం చిరస్మరణీయం. కష్టాల్లో కడబడిన తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చిన పార్టీ మన బీఆర్ఎస్. గత 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త విశేషంగా కృషి చేశాడు. గ్రామస్థులు చూపిస్తున్న మద్దతు వల్ల బీఆర్ఎస్ మరింత బలంగా ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీ ఆవేశాలు మరింత విస్తరించి ప్రజల సంక్షేమానికి పాటుపడుతుంది,” అని వారు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......