పహల్గాం దాడిని ఖండిస్తూ మల్కాపూర్ యూత్,అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

అమాయక పర్యాటకుల మృతికి కోవొత్తులతో నివాళి

పహల్గాం దాడిని ఖండిస్తూ మల్కాపూర్ యూత్,అఖిలపక్షం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ

చిల్పూర్, తెలంగాణ ముచ్చట్లు:

జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయక పర్యాటకులపై ముష్కరులు నిర్వహించిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జనగాం జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ యూత్ మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో కోవొత్తులతో మౌన ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో భారీగా యువతీ యువకులు, గ్రామస్తులు ర్యాలీలో పాల్గొని అమాయకుల మృతికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, తోకల సంపత్ రెడ్డి మాట్లాడుతూ,
“అమాయక పర్యాటకులపై ముష్కరులు చేయించిన అఘాయిత్యం మానవత్వానికి చెరసి. ఇటువంటి దాడులు దేశ ఐక్యతను, సామరస్యాన్ని భంగం చేయలేవు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. దేశ భద్రత కోసం ప్రతి పౌరుడూ మద్దతుగా నిలవాలి,” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, తోకల సంపత్ రెడ్డి, ఉరడి సతీష్, దొరమ్ శ్రీనివాస్, చొప్పరి అజయ్, కుమార్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యూత్ సభ్యులు కూడా పెద్దఎత్తున పాల్గొని సామూహికంగా మౌనం పాటించారు. ర్యాలీ చివర్లో దేశ భద్రతా బలగాలకు మద్దతుగా నినాదాలు చేయడం జరిగింది.IMG-20250427-WA0105

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .