ఉగ్రవాద దాడులను ఖండించిన నగర కాంగ్రెస్ కమిటీ

ఉగ్రవాద దాడులను ఖండించిన నగర కాంగ్రెస్ కమిటీ

మృతులకు ఘన నివాళి

–కొవ్వొత్తులతో ర్యాలీ

WhatsApp Image 2025-04-27 at 8.29.58 PM (1)

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నగరంలో 9,10,11,12,13 వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల్ల ఆద్వర్యంలో రోటరీ నగర్ నుండి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొని మాట్లాడుతూ... ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేశారు.వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్థానమని చేస్తున్నట్లు అన్నారు.ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అమాయక ప్రజలను పొట్టపెట్టుకున్న ఉగ్రవాద సంస్థలను నిర్మూలన చేయాలని డిమాండ్ చేశారు.ఉగ్రదాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో దేశప్రజలు ఒక్కటై బాధిత కుటుంబాలకు నిలబడాలని కోరారు.   
10వ డివిజన్ కార్పొరేటర్ చావ నారాయణరావు 
తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ 9 డివిజన్ కార్పొరేటర్ నాగుల్ మీరా 9వ డివిజన్ అధ్యక్షులు దొడ్డ ప్రవీణ్ 13వ డివిజన్ అధ్యక్షులు ఏలూరు రవికుమార్ 12వ రోజున అధ్యక్షులు దండా ప్రసాద్ 11వ రఅధ్యక్షులు ఫరీద్ ఖాద్రి బాబా  భాష  సుగుణ సిపిఐ పార్టీ నుంచి నాన్న బాల రామకృష్ణ జాకీర్ భాష జగదీష్ సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .