డీజీపీ రేసులో 8 మంది 

యూపీఎస్సీకి పేర్ల జాబితా పంపిన రాష్ట్ర ప్రభుత్వం

డీజీపీ రేసులో 8 మంది 

హైదరాబాద్,తెలంగాణ ముచట్లు:
రాష్ట్ర డీజీపీ పదవికి కొత్త అధికారి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. వీరిలో వివిధ బ్యాచ్‌లకు చెందిన అధికారులు ఉన్నారు.
 
పంపిన జాబితాలో ఉన్నవారు:
• రవి గుప్తా (1990 బ్యాచ్)
• సీవీ ఆనంద్ (1991 బ్యాచ్)
• డా. జితేందర్ (1992 బ్యాచ్)
• ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్)
• కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్)
• బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్)
• డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్)
• శిఖా గోయల్ (1994 బ్యాచ్)
 
అర్హతలు, సీనియారిటీ, సేవా కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ ఎనిమిది మందిలో ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి యూపీఎస్సీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనుంది.
 
ప్రస్తుతం డీజీపీగా ఉన్న డా. జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు. అలాగే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 5న, రవి గుప్తా డిసెంబర్ 19న రిటైర్ కానున్నారు.
 
ఇతరుల సేవా కాలాలు:
• సీవీ ఆనంద్ – 2028 జూన్ వరకు
• ఆప్టే వినాయక్ ప్రభాకర్ – 2029 అక్టోబర్
• బి. శివధర్ రెడ్డి – 2026 ఏప్రిల్ 28
• డా. సౌమ్య మిశ్రా – 2027 డిసెంబర్ 30
• శిఖా గోయల్ – 2029 మార్చి
 
ఈ నేపథ్యంలో డీజీపీ పదవికి ఎవరు ఎంపికవుతారు అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......