డీజీపీ రేసులో 8 మంది 

యూపీఎస్సీకి పేర్ల జాబితా పంపిన రాష్ట్ర ప్రభుత్వం

డీజీపీ రేసులో 8 మంది 

హైదరాబాద్,తెలంగాణ ముచట్లు:
రాష్ట్ర డీజీపీ పదవికి కొత్త అధికారి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (యూపీఎస్సీ) రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది అగ్రశ్రేణి ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. వీరిలో వివిధ బ్యాచ్‌లకు చెందిన అధికారులు ఉన్నారు.
 
పంపిన జాబితాలో ఉన్నవారు:
• రవి గుప్తా (1990 బ్యాచ్)
• సీవీ ఆనంద్ (1991 బ్యాచ్)
• డా. జితేందర్ (1992 బ్యాచ్)
• ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్)
• కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్)
• బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్)
• డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్)
• శిఖా గోయల్ (1994 బ్యాచ్)
 
అర్హతలు, సీనియారిటీ, సేవా కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ ఎనిమిది మందిలో ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి యూపీఎస్సీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనుంది.
 
ప్రస్తుతం డీజీపీగా ఉన్న డా. జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు. అలాగే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 5న, రవి గుప్తా డిసెంబర్ 19న రిటైర్ కానున్నారు.
 
ఇతరుల సేవా కాలాలు:
• సీవీ ఆనంద్ – 2028 జూన్ వరకు
• ఆప్టే వినాయక్ ప్రభాకర్ – 2029 అక్టోబర్
• బి. శివధర్ రెడ్డి – 2026 ఏప్రిల్ 28
• డా. సౌమ్య మిశ్రా – 2027 డిసెంబర్ 30
• శిఖా గోయల్ – 2029 మార్చి
 
ఈ నేపథ్యంలో డీజీపీ పదవికి ఎవరు ఎంపికవుతారు అన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి. నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి.
వేంసూరు, జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు): ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు నివాసాలు దెబ్బతిని నష్టపోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని...
ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.
వైయస్సార్ నగర్ లోని గుడిసెలను తొలగించవద్దు .
ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.
కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.
కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.