వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.

వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.

- సత్తుపల్లి–హైదరాబాద్ మార్గంలో 6 ఏసీ, 17 సూపర్ లగ్జరీ బస్సులు.
- సమయపాలన వివరాలు వెల్లడించిన డిపో మేనేజర్.
- గురిజాల లక్ష్మీనారాయణ.

సత్తుపల్లి, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్తుపల్లి డిపో నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులను నడుపుతున్నట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తుపల్లి నుండి హైదరాబాద్‌కు, అలాగే హైదరాబాద్ నుండి సత్తుపల్లికి ప్రతిరోజు 6 ఏసీ బస్సులు, 17 సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నాయని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

 *సత్తుపల్లి నుండి హైదరాబాద్ ఏసీ బస్సుల సమయాలు:* 

(బీహెచ్ఈఎల్) కు ఉదయం 7.45, 9.15, 10.00 గంటలకు, రాత్రి 9.00, 9.45, 10.30 గంటలకు ఏసీ బస్సులు బయలుదేరుతాయి. బీహెచ్ఈఎల్ నుండి సత్తుపల్లికి ఉదయం 8.00, 9.00, 10.00 గంటలకు, రాత్రి 9.00, 10.00, 11.00 గంటలకు బస్సులు నడుస్తాయి.

 *సత్తుపల్లి నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు:* 

ఉదయం 3.40 (ఎంజీబీఎస్), 5.10 (ఎంజీబీఎస్), 6.00 (బీహెచ్ఈఎల్), 7.30 (ఎంజీబీఎస్), 8.20 (బీహెచ్ఈఎల్), 8.45 (జీడిమెట్ల), 9.40 (ఈసీఐఎల్), 10.45 (ఎంజీబీఎస్) గంటలకు బయలుదేరుతాయి. మధ్యాహ్నం 12.30, 2.00, 3.30 గంటలకు ఎంజీబీఎస్‌కు బస్సులు ఉంటాయి. సాయంత్రం 4.00 గంటలకు ఎంజీబీఎస్‌కు బస్సు నడుస్తుంది. రాత్రి 9.00 (ఈసీఐఎల్), 9.30 (బీహెచ్ఈఎల్), 10.00 (బీహెచ్ఈఎల్), 10.15 (జీడిమెట్ల), 10.40 (గచ్చిబౌలి), 11.15 (లహరి స్లీపర్) కు బస్సులు ఉన్నాయి.

 *హైదరాబాద్ నుండి సత్తుపల్లి సూపర్ లగ్జరీ బస్సులు:* 

ఉదయం 4.40, 5.50 గంటలకు ఎంజీబీఎస్ నుండి, 6.20 గంటలకు బీహెచ్ఈఎల్ నుండి, 7.00 గంటలకు ఎంజీబీఎస్ మరియు బీహెచ్ఈఎల్ నుండి, 7.15 గంటలకు జీడిమెట్ల నుండి, 9.00 గంటలకు ఈసీఐఎల్ నుండి, 11.15 గంటలకు బీహెచ్ఈఎల్ నుండి బస్సులు నడుస్తాయి. మధ్యాహ్నం 2.20 గంటలకు ఎంజీబీఎస్ నుండి బస్సు బయలుదేరుతుంది. సాయంత్రం 4.15, 6.00 గంటలకు ఎంజీబీఎస్ నుండి బస్సులు ఉంటాయి. రాత్రి 8.40 గంటలకు గచ్చిబౌలి నుండి, 8.45 గంటలకు ఎంజీబీఎస్ నుండి, 9.00 గంటలకు ఈసీఐఎల్ నుండి, 9.20 గంటలకు జీడిమెట్ల నుండి, 9.20 గంటలకు లహరి స్లీపర్ బీహెచ్ఈఎల్ నుండి, 9.40 గంటలకు బీహెచ్ఈఎల్ నుండి బస్సులు నడుస్తాయి.
అదేవిధంగా సత్తుపల్లి నుండి తిరుపతికి మధ్యాహ్నం 3 గంటలకు, అలాగే తిరుపతి నుండి సత్తుపల్లికి IMG-20260313-WA0055మధ్యాహ్నం 3 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తాయని డిపో మేనేజర్ తెలిపారు. సత్తుపల్లి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురిజాల లక్ష్మీనారాయణ కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ...
ప్రగతి పథంలో పేదల సంక్షేమం
ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి
అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!
వేసవిలో ఆర్టీసీ ప్రయాణికులకు చల్లని కబురు.
శీనన్న మృతి… మండలానికి తీరని లోటు
ఎస్‌సి యాక్షన్ ప్లాన్ 2025–26 కింద స్వయం ఉపాధి పథకాలు