విట్ట శ్రీనివాస్ రెడ్డి మృతి.. నల్ల బ్యాడ్జీలతో అఖిలపక్ష నాయకుల సంఘీభావం
Views: 2
On
పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మదిగట్ల గ్రామంలో మాజీ మండల పీఏసీఎస్ చైర్మన్ విట్ట శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల అఖిలపక్ష నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విట్ట శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు పొందారని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.ఆయన మరణం మండలానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు.అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పలువురు స్థానికులు పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Mar 2026 22:28:49
కొనుగోలు కేంద్రాలు లేక దళారీల పాలవుతున్న మొక్కజొన్న రైతులు
కేసీఆర్ పాలనలో కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచాం
ఖమ్మం బ్యూరో, మార్చి 13(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ...


Comments