మంగంపల్లి అంగన్వాడీ కేంద్రంలో స్వయం పరిపాలన దినోత్సవం
పెద్దమందడి,మార్చి11(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి అంగన్వాడీ కేంద్రంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.చిన్నారుల మేధో వికాసం, నైపుణ్యాల అభివృద్ధి మరియు వారి ప్రగతిని అంచనా వేసేందుకు ప్రతి సంవత్సరం ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారులు వివిధ విద్యా కార్యక్రమాలు, ఆటలు, పాటలు, కథలు చెప్పడం వంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వారి అభ్యాస స్థాయిని పరిశీలించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.అంగన్వాడీ ఉపాధ్యాయులు పిల్లలకు సంవత్సరం పొడవునా అందించిన విద్య, పోషణ, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై తల్లిదండ్రులకు వివరించారు.పిల్లల మేధో వికాసం, సామాజిక నైపుణ్యాలు, సృజనాత్మకత ఎలా అభివృద్ధి చెందాయో ప్రదర్శనల ద్వారా చూపించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనన్య, శ్రావణి, జానకి, అక్షయ, రిషి, శ్రీనుష్, ఈశాంత్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే తల్లిదండ్రులు, గ్రామస్థులు కూడా హాజరై చిన్నారులను ప్రోత్సహించారు.ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని అంగన్వాడీ నిర్వాహకులు తెలిపారు.


Comments