బాలికలకు సైకిళ్ల పంపిణీ

బాలికలకు సైకిళ్ల పంపిణీ

_చదువులో ముందుండి అన్నిరంగాల్లో రాణించాలి 

– కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, మార్చి 10 ( తెలంగాణ ముచ్చట్లు):

బాలికలు చదువులో ముందుండి భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా 100 సైకిళ్లు అందించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ వంద శాతం హాజరు ఉన్న బాలికలకు సైకిళ్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి 21 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.IMG-20260310-WA0130

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!