బాలికలకు సైకిళ్ల పంపిణీ
_చదువులో ముందుండి అన్నిరంగాల్లో రాణించాలి
– కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, మార్చి 10 ( తెలంగాణ ముచ్చట్లు):
బాలికలు చదువులో ముందుండి భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలికలకు ఉచితంగా 100 సైకిళ్లు అందించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ వంద శాతం హాజరు ఉన్న బాలికలకు సైకిళ్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి 21 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎస్బీఐ రీజినల్ మేనేజర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Comments