మున్సిపల్ కమిషనర్ను కలిసిన మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి
_సీసీ రోడ్డు, నాలా అభివృద్ధి, బండచెరువు శుభ్రతపై వినతిపత్రం
మల్కాజ్గిరి, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి, ఐఏఎస్ను మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి వినతిపత్రాన్ని కమిషనర్కు అందించారు. సంతోష్ మాత గుడి నుండి నల్ల పోచమ్మ గుడి వరకు ఉన్న దీనదయాళ్ నగర్ రహదారిపై రూ.134 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన నంబర్తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు.ఈ ప్రతిపాదనను గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐఏఎస్ ఆమోదించినట్లు ఆమె పేర్కొన్నారు.అలాగే సూర్యనగర్ నాలాను ఎస్ఎన్డీపీ పథకం క్రింద అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. బండచెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి దోమల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గడప నర్సింగ్ రావు, మంగేష్ కుమార్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. తమ ప్రతిపాదనలకు మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి తెలిపారు.


Comments