అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల మహిళా సమావేశం
వేలేరు, మార్చ్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు శ్రీమతి రేణుక, ఏపీఎం శ్రీమతి అనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు బిల్లా యాదగిరి హాజరై మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అనేక పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో వివో భవనాలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, మండల సమైక్య కార్యదర్శి రాజమ్మ, కార్యవర్గ సభ్యులు, సీసీలు, వివిధ గ్రామాల వివో అధ్యక్షులు, కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.


Comments