బిసి సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులుగా పంతంగి మారుతీ నియామకం
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)
బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తిని మధు గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె వి కృష్ణారావు పాల్గొని బిసి జాతి బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది . వారి చే బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులుగా పంతంగి మారుతీ కి నియామక పత్రం అందించడం జరిగింది . మారుతీ ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గ నుంచి బిసి సంక్షేమ సంఘం లో కొంత మంది నాయకులు చేరడం జరిగింది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు యాదవ్ , జిల్లా గౌరవ సలహాదారులు పద్మాచారి , జిల్లా ఉపాధ్యక్షులు పార్థసారథి జిల్లా కార్యదర్శి మక్కాల వెంకన్న , యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గునిగంటి వీరన్న , యువజన సంఘం ప్రధాన కార్యదర్శి చిన్నంశెట్టి రామకృష్ణ , బిసి ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పుల్లూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు .


Comments