హస్తినాపురంలో ఆదిత్య హాస్పిటల్ ప్రారంభం
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఎల్ బి నగర్, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురంలో నూతనంగా నిర్మించిన ఆదిత్య హాస్పిటల్ను ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ప్రాంతీయ ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయబడిందని, ఇది స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సామ రంగారెడ్డి, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, వైద్యులు, స్థానిక నాయకులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించిన అతిథులు, భవిష్యత్తులో మరింత విస్తృత వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.


Comments