సత్తుపల్లి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.
చైర్మన్గా మహమ్మద్ రెహనా బేగం కమల్ పాషా విజయం.
సత్తుపల్లి, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సత్తుపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. 22వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ రెహనా బేగం కమల్ పాషా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై పట్టణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల విశ్వాసం, పార్టీ నాయకత్వం మద్దతుతో ఘన విజయం సాధించిన ఆమెకు పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఉత్కంఠభరితంగా సాగగా చివరికి కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం తన ప్రాధాన్యాలుగా ఉంటాయని నూతన చైర్మన్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరమని, రాజకీయ భేదాలకు అతీతంగా పట్టణ ప్రగతే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్లకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ విజయానికి నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకం, పార్టీ శ్రేణుల అంకితభావం, ప్రజల ఆశీర్వాదమే కారణమని పేర్కొంటూ, పట్టణ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. విజయానంతరం పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపగా, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.


Comments