పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ఎంబీబీఎస్ విద్యార్థి తేజ నాయక్కు రూ.10 వేల నగదు అందజేత
Views: 2
On
పెద్దమందడి,ఫిబ్రవరి16(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం అనకాయపల్లి తండాకు చెందిన గోపాల్ నాయక్ కుమారుడు తేజ నాయక్ వైద్య విద్యలో ప్రవేశం పొంది మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించాలని తండా వాసులు అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ను సంప్రదించారు.దీంతో ఫౌండేషన్ తరపున పుస్తకాల కొనుగోలు కోసం రూ.10 వేల నగదును సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సాయినాథ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా డా. సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ సేవలందిస్తున్న ఫౌండేషన్ను అభినందించారు. తేజ నాయక్ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.విద్యార్థి తేజ నాయక్ మరియు అతని కుటుంబ సభ్యులు ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Feb 2026 22:09:43
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...


Comments