కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు భక్తుల రద్దీ
కీసర, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట భవాని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నాలుగో రోజు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు అంగరంగ వైభవంగా నిర్వహించగా, ఆ ఆధ్యాత్మిక ఉత్సాహం నాలుగో రోజు కూడా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది.ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ తాటాకం వెంకటేష్, పీఈఓ సుధాకర్ రెడ్డి, గుడి పంతులు మరియు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


Comments