రైతులకు తీరని యూరియా కష్టాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆందోళన

జిల్లా టిఆర్పి యూత్ అధ్యక్షులు రవికుమార్ 

రైతులకు తీరని యూరియా కష్టాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆందోళన

వనపర్తి,ఫిబ్రవరి16(తెలంగాణ ముచ్చట్లు): 

ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జి. రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మదనాపురం కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం యూరియా కొరత లేదని ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతుల అవస్థలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. నాటు వేసి నెల రోజులు దాటినా పంటలకు యూరియా అందటం లేదని ఆరోపించారు.గ్రామాల్లో నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ లేని రైతులు సాంకేతిక సమస్యల కారణంగా యూరియాను సకాలంలో పొందలేకపోతున్నారని తెలిపారు. సమయానికి ఎరువు వేయకపోతే దిగుబడి దెబ్బతింటుందని, అప్పులు చేసి పంటలు వేసిన రైతులకు ఇది మరింత భారమవుతుందని చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం