మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, కల్లు దుకాణాల మూసివేత
పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం విక్రయాలపై నిషేధం
మేడ్చల్ మల్కాజిగిరి, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో ఈ నెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలో మద్యం, కల్లు దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్ తేదీకి 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత ప్రాంతాల్లో మద్యం, కల్లు విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత యాజమాన్యాలు, అధికారులు ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని తెలిపారు.


Comments