శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ తో కలిసి విస్తృత బస్తీబాట కార్యక్రమం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్

శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ తో కలిసి విస్తృత బస్తీబాట కార్యక్రమం

మల్లాపూర్, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ శక్తిసాయి నగర్ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ తెలిపారు. శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ స్పందనతో కలిసి కాలనీలలో విస్తృత పర్యటన నిర్వహించారు.శక్తిసాయి నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీ, మీనా నగర్ ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రోడ్డు, డ్రైనేజీ సమస్యలపై కాలనీ పెద్దలతో కలిసి నెమలి అనిల్ కుమార్ ‘బస్తీబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ పర్యటనలో స్పందించిన మల్లాపూర్ ఏఈ స్పందనతో పాటు ఆయన బృందం కాలనీల్లో పర్యటించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి, త్వరలోనే పనులు చేపడతామని అధికారులు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు నాయకులు పి. వీరస్వామి, కోయలకొండ రాజేష్, విజయ్ రెడ్డి, అన్వర్, రామ్మూర్తి గౌడ్, ప్రతాప్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు
కుషాయిగూడ, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన ఛాంపియన్ షాటోఖాన్ మార్షల్...
శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ తో కలిసి విస్తృత బస్తీబాట కార్యక్రమం
యువతి అడ్వకేట్ స్వప్న హత్యపై బార్ అసోసియేషన్ల ఆగ్రహం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం 
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం
మౌలిక వసతులే మా లక్ష్యం.!
రేషన్ దుకాణాల వద్ద పేదల బియ్యం దోపిడీ