సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడికి అందజేసిన  పరమేశ్వర్ రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడికి అందజేసిన  పరమేశ్వర్ రెడ్డి

మల్లాపూర్, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.2.5 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బాధితుడికి పంపిణీ చేశారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి. రాము (మల్లాపూర్ శ్రీనికేతన్ స్కూల్ కారస్పాండెంట్ నరసింహ బావ)కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2,50,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలవడం తమ బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం సకాలంలో అందేలా కృషి చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ ఆర్థిక సహాయం రాము చికిత్సకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటూ, ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సద్గుణ్, మల్లాపూర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, నరసింహ, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.