శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు

శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు

ఎల్కతుర్తి, జనవరి 31 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఉన్న శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించగా, శ్రీ శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు, దూప దీప నైవేద్య సంఘం ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి నేతృత్వంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావనఋషి, శ్రవణ్ రావ్, రవీందర్, మహిపాల్, విజయ, మమతతో పాటు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో  స్పర్శ సామాజిక...
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 
మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం