పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

● *అన్వర్‌ పాషాకు రూ.2.20 లక్షల చెక్కు అందజేత*

● *మంత్రి పొంగులేటి చొరవతో ఆర్థిక వెసులుబాటు*

ఖమ్మం బ్యూరో, జనవరి 27(తెలంగాణ ముచ్చట్లు)

అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) భరోసానిచ్చింది. ఏదులాపురం మున్సిపాలిటీ రెండో వార్డుకు చెందిన షేక్‌ అన్వర్‌ పాషా కుమారుడు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం భారీగా ధనం వెచ్చించారు.  ఈ విషయాన్ని స్థానిక యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఏనుగు మహేష్‌.. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేయించారు. మంత్రి సిఫారసుతో ప్రభుత్వం నుంచి రూ.2,20,000 మంజూరయ్యాయి. మంగళవారం మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారుడు అన్వర్‌ పాషా ఈ చెక్కును అందుకున్నారు. కష్టకాలంలో తమ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రికి, సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!