వెల్టూర్ మన చర్చ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

వెల్టూర్ మన చర్చ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ న్యూ ఎస్సీ కాలనీలోని మనచర్చి వద్ద సోమవారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు.చర్చి పాస్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండావందన పండగను భక్తి, దేశభక్తి భావాలతో జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాకు ఘనంగా వందనం అర్పించి, భారతదేశ ఐక్యత, సమగ్రత, శాంతి, సౌభ్రాతృత్వ విలువలను గుర్తు చేసుకున్నారు. దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పాస్టర్ సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు దేశానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తి అని సందేశమిచ్చారు.ఈ కార్యక్రమంలో మన చర్చి సభ్యులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు