విద్యార్థులు సైన్స్‌ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి

స్కూల్ ప్రిన్సిపాల్ లవ్లీ బెన్నీ

విద్యార్థులు సైన్స్‌ను అందిపుచ్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి

వనపర్తి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లబ్ నగర్ గౌతమ్ మోడల్ హైస్కూల్లో శనివారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది విద్యార్థులు హాజరుకాగా, మొత్తం 174 వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ లవ్లీ బెన్నీ మాట్లాడుతూ ..రోజురోజుకు సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు సైన్స్‌ను అలవర్చుకుని కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు.చిన్ననాటి నుంచే ఆలోచనా శక్తిని పెంపొందించుకుంటే సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.సైన్స్ అంటేనే నిజమని, సైన్స్ ద్వారా ప్రపంచంలో ప్రకృతిలో దాగి ఉన్న సత్యాలను తెలుసుకోవచ్చని చెప్పారు.సైన్స్‌ను జీవితంలో భాగంగా చేసుకుంటే భవిష్యత్తులో ముందుకు సాగడం సులభమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ బెన్నీ జోసెఫ్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు