విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభను విజయవంతం చేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు 

విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభను విజయవంతం చేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు 

వరంగల్,జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):

గిరిజన ఐక్యతకు ప్రతీకగా, సంఘ గౌరవానికి మరో మైలురాయిగా హనుమకొండలో గిరిజన విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం కంపెనీ కార్యవర్గ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా నిర్వహించబడిన సందర్భంగా సంఘ నాయకులు, సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి అభూతపూర్వమైన స్పందన లభించడంతో పాటు, అధిక సంఖ్యలో హాజరైన గిరిజన జాతి సోదర–సోదరీమణులు సభ విజయానికి ప్రధాన బలంగా నిలిచారని సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హాజరు సంఘానికి అపారమైన ధైర్యాన్ని ఇచ్చిందని, సభ్యుల సహకారం, ఐక్యత సంఘ ప్రయాణానికి మార్గదర్శకంగా మారిందని తెలిపారు.

అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అహర్నిశలు అంకితభావంతో పనిచేసిన హనుమకొండ సర్కిల్ బాడీ, వరంగల్ సర్కిల్ బాడీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశపు హాల్ అలంకరణ, భోజన ఏర్పాట్లతో పాటు సమన్వయంతో పనిచేసి సంఘ ప్రతిష్ఠను మరింత పెంచడంలో వారు కీలక పాత్ర పోషించారని అన్నారు.
ఈ సందర్భంగా వాలు నాయక్, హర్జీ నాయక్, శ్రీరామ్ నాయక్ లు మాట్లాడుతూ, ఈ ఆత్మీయత, సంఘబలం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులోనూసంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.IMG-20260124-WA0030

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .