యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం

యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం

పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):

గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా పెద్దమందడి మండలం మద్దిగట్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తికి ప్రతీక అయిన మహానేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని స్మరించుకుంటూ యువతలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘనంగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మద్దిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనే సేవాభావంతో ఈ కార్యక్రమానికి అవసరమైన బహుమతులను జె. మల్లేష్, జె. తిరుపతయ్య కుమారుడు, ఉదారంగా సమకూర్చారు.విద్యార్థుల్లో ఆలోచనల్లో అగ్ని, హృదయాల్లో దేశభక్తి, లక్ష్యాల్లో నాయకత్వం అనే స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమం సాగిందని మద్దిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు