యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం

యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం

పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):

గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా పెద్దమందడి మండలం మద్దిగట్ల జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో దేశభక్తి వాతావరణంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తికి ప్రతీక అయిన మహానేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని స్మరించుకుంటూ యువతలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘనంగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మద్దిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనే సేవాభావంతో ఈ కార్యక్రమానికి అవసరమైన బహుమతులను జె. మల్లేష్, జె. తిరుపతయ్య కుమారుడు, ఉదారంగా సమకూర్చారు.విద్యార్థుల్లో ఆలోచనల్లో అగ్ని, హృదయాల్లో దేశభక్తి, లక్ష్యాల్లో నాయకత్వం అనే స్ఫూర్తిని నింపే విధంగా ఈ కార్యక్రమం సాగిందని మద్దిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .