అమ్మవారిపేట జాతర ఏర్పాట్లను సమీక్షించిన డిసిపి దార కవిత
కాజీపేట్ జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అమ్మవారిపేట గ్రామం నందు ఈ నెల 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ మేడారం జాతరకు సంబంధించిన బందోబస్త్ తోపాటు రక్షణ తదితర అంశాల గురించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత స్వయంగా పరిశీలించారు. అంతేగాకుండా జాతర యొక్క 4 రోజులలో ఏ రోజు ఏమి జరుగుతుంది ఎంత జనాభా వస్తారు, యాత్రికులకు ఏలాంటి సౌకార్యలు ఏర్పాట్లు గతంలో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగాయా జాతర కార్యవర్గం సభ్యులు ఎవరెవరు ఏమి పని చేస్తున్నారని వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సెంట్రల్ జోన్ డిసిపిదార కవిత మాట్లాడుతూ అమ్మవారిపేట గ్రామం లోస్వయంభువు గా వెలిసిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం ఆనందంగా ఉంది. ఈసారి జాతరకు పటిష్టమైనబందోబస్త్ ఏర్పాటు చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి ఆపదలు లేకుండా క్షేమంగా అమ్మవార్లను దర్శించుకునే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేసి జాతర ప్రశాంతంగా జరిగేలా చూస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజిపేట్ ఏసిపి ప్రశాంత్ రెడ్డి , మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్ , సిబ్బంది స్థానిక కార్పొరేటర్ జలగం అనిత రంజిత్ ఆలయ చైర్మన్ కోడూరి భిక్షపతి పాల్గొన్నారు.


Comments