పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజల విజ్ఞప్తి

పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన

వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరిజె అనిత నర్సింహారావు తన ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎక్కడ మార్కెట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే అంశంపై గ్రామస్తులతో చర్చించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెందిన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా డబ్బాలు ఏర్పాటు చేసి కబ్జా చేసిన విషయాన్ని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని, అక్రమ కబ్జాలను తొలగించి ప్రజాప్రయోజనాలకు వినియోగంలోకి తేవాలని వారు కోరారు.

దీనిపై స్పందించిన సర్పంచ్, కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఉపయోగపడే విధంగా వీలైనంత త్వరగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మరిజె నర్సింహారావు, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మారబోయిన రాజు, కొయ్యడా మహేందర్, ఎమ్‌డీ హరీఫ్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
  ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు) కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన యోధుడు, ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన కామ్రేడ్ భూక్య వీరస్వామి మరణం పట్ల
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ 
శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 
సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం
మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది