కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం

మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై తెలంగాణ ప్రభుత్వం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో “కూరగాయల సాగులో మెళకువలు” అనే మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఇండో–ఇజ్రాయిల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి తెలిపారు.జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటెబుల్స్ అండ్ ఫ్లవర్స్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇజ్రాయిల్ ఎంబస్సీ అగ్రికల్చర్ అటాచ్ మాషావ్ ఉరిరాబిన్ స్టీన్, డ్యానిల్ హదాద్ (ఎంబస్సీ ఆఫ్ ఇజ్రాయిల్), జిల్లా ఉద్యానశాఖాధికారి శ్రీధర్‌తో పాటు 12 రాష్ట్రాల నుంచి 40 మంది ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి మాట్లాడుతూ, కూరగాయలు మరియు పూల సాగులో రైతులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో మట్టిరహిత కూరగాయల సాగు, బిందుసేద్యం ప్రాముఖ్యత, నీటిలో కరిగే ఎరువుల యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వాతావరణానికి అనుగుణమైన వంగడాల ఎంపిక, కూరగాయల నిల్వ కాలం పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట కోత అనంతరం పాటించాల్సిన పద్ధతులపై ప్రతినిధులు సుబ్బారావు, శేశ్‌నాథ్ వివరించారు. కూరగాయల్లో నులిపురుగుల నివారణపై పీడీ మాణిక్యరావు సూచనలు అందించారు.భారత ప్రభుత్వ అగ్రికల్చర్ పీడీ బ్రహ్మాదేవ్ కూరగాయల అంటుకట్టుట సూత్రాలు,అభ్యాసం,కూరగాయలు–పూల సాగులో వివిధ రకాల ఉపయోగాలపై వివరించారు. డైరెక్టర్ఆఫ్ హార్టికల్చర్  యాస్మిన్ బాషా, ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా పాల్గొని, అధికారులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. IMG-20251215-WA0097

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి