వేలేరు మండలంలోని క్లస్టర్లలో బందోబస్త్ ఏర్పాటు

వేలేరు మండలంలోని క్లస్టర్లలో బందోబస్త్ ఏర్పాటు

వేలేరు, 29 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు రేపు జరుగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఖచ్చితంగా పరిశీలించేందుకు పోలీసులు ముందడుగు వేశారు. ధర్మసాగర్ సిఐ శ్రీధర్, వేలేరు ఎస్సై సురేష్ సంయుక్తంగా మండలంలోని అన్ని క్లస్టర్లను పర్యటించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అనుచిత ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రతి గ్రామంలో తగిన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని అధికారులు సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామాల్లో వచ్చే అభ్యర్థులు, కార్యకర్తలు నియమాలు పాటించేలా అవగాహన కల్పించడంతో పాటు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదనంగా, క్లస్టర్ వారీగా సిబ్బంది నియామకాలు, పహారా బృందాలు, రవాణా సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష జరిపినట్లు పోలీసులు తెలిపారు. రేపటి నామినేషన్ ప్రక్రియలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారుIMG-20251129-WA0021

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్