జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి  

సమాచారశాఖ మంత్రికి టీడబ్ల్యుజెఎఫ్ వినతి పత్రం అందజేత

 జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి  

హైదరాబాద్, నవంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు)

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాల్సిందిగా సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ టీడబ్ల్యుజెఎఫ్, హెచ్ యు జె ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.అక్రిడిటేషన్ కార్డులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ, ఇళ్ల స్థలాల మంజూరు వంటి కీలక అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా టీడబ్ల్యుజెఎఫ్ ప్రతినిధుల బృందం ఐ అండ్ పిఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ జగన్‌లను కూడా కలిసి వినతులు సమర్పించింది.ఇప్పటికే ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఇదే అంశాలపై వినతి పత్రాలు అందజేసినట్టు నాయకులు తెలిపారు. ఈ క్రమంలో నగరంలోని ఐ అండ్ పిఆర్ అధికారులకు కూడా విజ్ఞప్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, రాజశేఖర్, హాష్మీ తదితరులు పాల్గొన్నారుIMG-20251129-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .