సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: మోరంపూడి పాండురంగారావు

సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: మోరంపూడి పాండురంగారావు

సత్తుపల్లి, డిసెంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలు పార్టీలకు అతీతంగా గెలిపించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం వేంసూరులోని ఎర్ర రామయ్య భవనంలో ఎలిగినేని రామారావు అధ్యక్షతన జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన,
ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే, కేరళ తరహా సుపరిపాలన మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు గ్రామస్థాయి నుంచే అమలు కావాలంటే కమ్యూనిస్టు ప్రతినిధులు గెలవడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే సీపీఎం అభ్యర్థులను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో పాల్గొన్న వారు:మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్‌రావు, మండల కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్, మోరంపూడి వెంకటేశ్వరరావు,సీనియర్నాయకులు కొత్తా సత్యనారాయణ, అర్వపల్లి వెంకటేశ్వరరావు, డంకర శ్రీను, కొత్తా అప్పారావు, ఎండిమందల వెంకటేశ్వరరావు, గడిపర్తి మోహన్‌రావు, ఎలిగినేని రాంబాబు తదితరులు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .