కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి  129 ఫిర్యాదుల స్వీకరణ

కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి  129 ఫిర్యాదుల స్వీకరణ

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 129 ఫిర్యాదులు స్వీకరించామని అదనపు కలెక్టర్ ‌ డి. విజయేందర్ రెడ్డి తెలిపారు. డిఆర్ఓ హరిప్రియ తో కలిసి ఆయన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని అధికారులు గుర్తు చేశారు.ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే క్లియర్ చేయాలని, ప్రజా సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇంకా, సిఎంఓ ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా వేగంగా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారుIMG-20251201-WA0009

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్