కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి 129 ఫిర్యాదుల స్వీకరణ
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 129 ఫిర్యాదులు స్వీకరించామని అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి తెలిపారు. డిఆర్ఓ హరిప్రియ తో కలిసి ఆయన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని అధికారులు గుర్తు చేశారు.ఆన్లైన్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే క్లియర్ చేయాలని, ప్రజా సమస్యలను పెండింగ్లో ఉంచకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇంకా, సిఎంఓ ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న కేసులను కూడా వేగంగా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు


Comments