గ్రామాభివృద్ధికి డబ్బుల రాజకీయాలు వద్దు.

సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ నాయకురాలు నాగమణి. - అన్ని పార్టీల నేతలకు ఒకే సలహా.

గ్రామాభివృద్ధికి డబ్బుల రాజకీయాలు వద్దు.

దమ్మపేట, నవంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

దమ్మపేట మండలంలోని గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులకు ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నట్టు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకురాలు గంగాధర నాగమణి తెలిపారు.

ఆమె మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, లేదా ఇతర పార్టీల నాయకులు అందరూ ఒక గ్రామ కమిటీగా కూర్చొని, ప్రజల ముందే చేయబోయే అభివృద్ధి పనులను స్పష్టంగా చెప్పాలని కోరారు.

డబ్బులు పంచడం, వస్తువులు పంచడం, అమాయక ఓటర్లకు ఆశలు చూపించడం వంటి పద్ధతులు గ్రామాలను వెనుకబెడతాయని ఆమె అన్నారు.

“ఎవ్వరి పార్టీ అయినా సరే… డబ్బులు పంచి గెలవాలనే రాజకీయాలు ఆగాలి. అభివృద్ధి పనులతోనే ఓట్లను కోరండి. గ్రామం ముందుకు వెళ్లాలంటే ఇదే మార్గం” అని నాగమణి స్పష్టం చేశారు.

పెద్దలు, ప్రజలు, ప్రతి పార్టీ శ్రేణులు ఈ సలహాను ఆలోచించి, స్వచ్ఛమైన ఎన్నికలకు సహకరించాలని ఆమె అభిలాష వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్