బాలాజీ ఎంక్లేవ్ పార్కులో బోర్ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ బన్నాల
చిల్కానగర్, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
బాలాజీ ఎంక్లేవ్ ఉద్యానవనంలో నూతన వాటర్ బోర్ పనులకు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. చిల్కానగర్ డివిజన్లో పార్కు అభివృద్ధి కార్యక్రమాల భాగంగా కొబ్బరికాయ కొట్టి బోరు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ “ఇటీవల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పార్కు ఇనాగురేషన్ జరిగిన తర్వాత మిగిలిన వసతుల పనులను వేగవంతం చేస్తున్నాం. వీలైనంత త్వరలో కాంట్రాక్టర్తో కలిసి పార్కులో అన్ని సౌకర్యాలు పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తాం” అని అన్నారు.పార్కు అభివృద్ధికి బాలాజీ ఎంక్లేవ్, రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సహకరించడాన్ని ఆమె అభినందించారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు:బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బాలాజీ ఎంక్లేవ్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఓంకార్ సింగ్, రమణ గుప్తా, శంకర్, రాఘవేంద్ర నగర్ కాలనీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, రాఘవేంద్ర నగర్-2 అధ్యక్షులు ప్రొఫెసర్ రాములు, అడ్వకేట్ శ్రీనివాస్, నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, శ్యామ్, ఆర్టికల్చర్ సూపర్వైజర్ బాలు తదితరులు.


Comments