సాయిబాబా కాలనీలో 100 కేవీ కొత్త ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ డివిజన్ సాయిబాబా కాలనీలో ఏర్పాటు చేసిన కొత్త 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి శనివారం రోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, “కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో కాలనీలో విద్యుత్ ఒత్తిడి సమస్యలు తగ్గి, గృహాలకు నిరంతరంగా మరియు స్థిరంగా విద్యుత్ సరఫరా అందుతుంది” అని తెలిపారు. ఈ పనులను వేగంగా పూర్తి చేసిన విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి రజిత పరమేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈకార్యక్రమంలో ఎస్ఈ ప్రతిభ సోనీ, డిఈ సుబ్బారావు, ఏడి రవీందర్, ఏఈ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే కాలనీవాసులైన అంజిరెడ్డి, సురేష్, తెలకల మోహన్ రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, గణేష్, రత్నం, రామచంద్రయ్య, రమణారెడ్డి, మల్లేష్,వెంకటరెడ్డి,నరసింహ, సత్తిరెడ్డి, వెంకటేష్, తుమ్మల రాజేందర్ రెడ్డి, అన్వర్, బుడిగె మల్లేష్, శ్రీను, నాగూర్ భాష, పిరాంబి, వీరప్ప, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments