కస్తూరిబా గురుకుల కళాశాల భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

కస్తూరిబా గురుకుల కళాశాల భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి కస్తూరిబా గురుకుల జూనియర్ కళాశాల నూతన భవనానికి శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ.. నూతన భవనం విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన విద్యాసౌకర్యాలను అందించేలా రూపకల్పన చేయడం జరుగుతుందని తెలిపారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యార్థులు తరగతులు, ల్యాబ్‌లు మరియు ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వహించగలుగుతారని ఆయన  తెలిపారు. కస్తూరిబా జూనియర్ గురుకుల కళాశాలకు భవనం మంజూరు చేయడం పట్ల విద్యార్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20251121-WA0222

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .