పసుపులేటి శ్రీలత దంపతులు కాంగ్రెస్ లోకి చేరిక

పసుపులేటి శ్రీలత దంపతులు కాంగ్రెస్ లోకి చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి

ఖమ్మం బ్యూరో, నవంబర్ 29, తెలంగాణ ముచ్చట్లు:

నేలకొండపల్లి పట్టణానికి చెందిన సాయిరాం మెడికల్  నిర్వాహకులు పసుపులేటి  శ్రీలత - ఉపేందర్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ....  “కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలన్నారు.  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు  గెలుపు గుర్రాలకే అవకాశం ఉంటుంది” అని స్పష్టంచేశారు. అందరూ ఏకతాటిపై పనిచేసి పార్టీ అభ్యర్థిని ఘనవిజయంతో గెలిపించాలని దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డు బొందయ్య,  వంగవీటి నాగేశ్వరరావు, మామిడి వెంకన్న, మైసా శంకర్, రాంబాబు, దోసపాటి చంద్రశేఖర్, కనమర్లపూడి రమేష్,  రాయపూడి నవీన్, ఐతనబోయిన శ్రీను, మన్నే రవి, లక్కమ్ ఏడుకొండలు, కొడాలి గోవిందరావు, వాకా శ్రీనాథ్, రమేష్, గుడిబోయిన వెంకటేశ్వర్లు, సుభాన్, వంగవీటి రవి తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .