ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.

IMG-20251130-WA0002సత్తుపల్లి, నవంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

వేంసూరు మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించేందుకు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మర్లపాడు, కుంచపర్తి గ్రామాల్లోని ఐకెపి, సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు తీసుకొచ్చిన ధాన్యం కాటాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ధాన్యం కాటాలు వేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలి అని స్పష్టం చేశారు.

రాబోయే రెండు రోజుల పాటు తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు తమ ధాన్యాన్ని టార్పాల్స్‌తో కప్పి తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. తనిఖీలలో తహశీల్దార్ మాణిక్‌రావు, వ్యవసాయ అధికారి పచ్చల రాంమోహన్, రెవెన్యూ అధికారులు, జీపీఓలు, ఐకెపి మరియు సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .