ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.

IMG-20251130-WA0002సత్తుపల్లి, నవంబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

వేంసూరు మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించేందుకు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మర్లపాడు, కుంచపర్తి గ్రామాల్లోని ఐకెపి, సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు తీసుకొచ్చిన ధాన్యం కాటాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ధాన్యం కాటాలు వేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలి అని స్పష్టం చేశారు.

రాబోయే రెండు రోజుల పాటు తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులు తమ ధాన్యాన్ని టార్పాల్స్‌తో కప్పి తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. తనిఖీలలో తహశీల్దార్ మాణిక్‌రావు, వ్యవసాయ అధికారి పచ్చల రాంమోహన్, రెవెన్యూ అధికారులు, జీపీఓలు, ఐకెపి మరియు సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్