అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 

అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 

నాచారం, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)

నాచారం డివిజన్‌లో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ బుధవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.రైతు బజార్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, అన్నపూర్ణ కాలనీకి ఆనుకుని ఉన్న హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు బఫర్ జోన్‌లో థీమ్ పార్క్ ఏర్పాటు, ఎర్రకుంట హిందూ స్మశానవాటికను వైకుంఠధామంగా అభివృద్ధి చేయడం వంటి కీలక విషయాలను కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.అదనంగా, పటేల్‌కుంట చెరువు పక్కన కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీవరేజ్ లైన్ డైవర్షన్ పనులు ఇంకా పది శాతం మాత్రమే మిగిలి ఉన్నందున వాటిని త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు.ప్రతిపాదించిన అన్ని అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలిస్తామని కమిషనర్ ఆర్.వి కర్ణన్ హామీ ఇచ్చారు. సంబంధిత సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్‌కు ఫోన్ ద్వారా సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .