పశుపతినాథ్ దేవస్థానంలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు

సామూహిక పంచామృత మహారుద్రాభిషేక0  సాయంత్రం ఆకాశ దీపార్చన

పశుపతినాథ్ దేవస్థానంలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు

WhatsApp Image 2025-11-17 at 8.18.15 PM (1) ఎల్కతుర్తి, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం బ్రహ్మముహూర్తం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని పంచామృతంతో సామూహిక మహా రుద్రాభిషేకంలో పాల్గొన్నారు.

వేదపండితులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి బిల్వదళాలతో అర్చనలు జరగగా, ఆలయం ఆవరణం “ఓం నమః శివాయ”, “ఓం శ్రీ పశుపతినాథాయ నమః” నినాదాలతో మార్మోగింది. మహిళా భక్తులు దీపాలు వెలిగించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

సాయంత్రం ఆరు గంటలకు ఆకాశదీప ప్రజ్వలన, ఈశ్వరలింగ దీపార్చన, అష్టోత్తర శతనామార్చన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
కార్తీకమాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం పుణ్యప్రదమని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో శివాలయ కమిటీ, యువకులు, మహిళా భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .