వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక చర్యలు 

ఎస్ఈ ప్రతిమషోమ్

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక చర్యలు 

చెర్లపల్లి, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని హబ్సీగూడ విద్యుత్ సర్కిల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ (ఎస్ఈ) ప్రతిమషోమ్ తెలిపారు.చెర్లపల్లి పారిశ్రామికవాడ లో ఇటీవల ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఫీడర్ బైఫర్కేషన్‌లో భాగంగా రెండు కొత్త విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ఫీడర్లను ఎస్ఈ ప్రతిమషోమ్ సైనిక్‌పురి డివిజన్ డీఈ అన్వర్ పాషా, చెర్లపల్లి ఏడీఈ రాందాస్‌లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ఈ ప్రతిమషోమ్ మాట్లాడుతూ,“స్థానికంగా నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేం దుకు ప్రత్యేక దృష్టి పెట్టాం. వారంలో మూడు రోజులపాటు బస్తీ బాట, విద్యుత్ వినియోగదారుల శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరిస్తున్నాం” అని తెలిపారు. వినియోగదారులు ఎలాంటి లోపం లేకుండా విద్యుత్ పొందేందుకు తమ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటూ తక్షణ స్పందన ఇస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో చెర్లపల్లి ఏఈ బాల్ రాజు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!