మిరాకిల్ మైండ్స్ లో బాలల దినోత్సవం.

నేటి విద్యార్థులే రేపటి అద్భుత భవిష్యత్తు.

మిరాకిల్ మైండ్స్ లో బాలల దినోత్సవం.

సత్తుపల్లి, నవంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మిరాకిల్ మైండ్స్ పాఠశాలలో నిర్వహించిన వినూత్న కార్యక్రమాలు చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపాయి. చాచా నెహ్రూ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఆరంభమైన వేడుకల్లో విద్యార్థులు చేసిన నృత్య రూపకాలు, ప్రతిభ ప్రదర్శనలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి.

భవిష్యత్తు నిర్మాణంలో తామే స్తంభాలమని భావిస్తూ విద్యార్థులు చేసిన పలుకులు, ప్రదర్శించిన అంకితభావం వేడుకకు ప్రత్యేకతను తెచ్చాయి. చిన్నారుల ప్రసంగాలు, పాటలు కార్యక్రమానికి మరింత అందం చేకూర్చాయి.

సామాజిక అవగాహన, విలువలతో కూడిన విద్య అందించి సత్తుపల్లి ప్రాంతం నుంచే భారతీయ సర్వీసులకు విద్యార్థులను పంపించడమే పాఠశాల లక్ష్యమని ప్రిన్సిపాల్ రత్నాకర్ తెలిపారు. పూర్తి ఆంగ్ల భాషలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుందని పుర ప్రముఖులు ప్రశంసించారు.

తల్లిదండ్రుల సహకారంతో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నాలు సాగనున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు.IMG-20251115-WA0070

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!