ఎంజేపీ గురుకులంలో ఘనంగా వందేమాతరం గీతాలాపన
పఠాన్చెరు,నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంజేపీ ఐనోల్, అల్లాదుర్గ్ బీసీ గురుకులంలో వందేమాతరం గీతాలాపన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్రవంతి మాట్లాడుతూ..వందేమాతరం గీతం భారతీయుల హృదయాల్లో దేశప్రేమను రగిలించిన ఉద్యమ నినాదమని పేర్కొన్నారు. వందేమాతరం గీత రచయిత బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో ఈ గీతాన్ని రాశారని, “వందే మాతరం” అంటే మాతృభూమికి వందనం అని అర్థమని తెలిపారు.
వందేమాతరం గీతం బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో కోట్లాది భారతీయుల్లో దేశభక్తి జ్వాలలు రగిలించిందని స్రవంతి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు స్మారకోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏటీపీ రేఖ, ఉపాధ్యాయులు, పీడీ, పీఈటీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments