ఎంజేపీ గురుకులంలో ఘనంగా వందేమాతరం గీతాలాపన

ఎంజేపీ గురుకులంలో ఘనంగా వందేమాతరం గీతాలాపన

పఠాన్‌చెరు,నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంజేపీ ఐనోల్, అల్లాదుర్గ్ బీసీ గురుకులంలో వందేమాతరం గీతాలాపన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్రవంతి మాట్లాడుతూ..వందేమాతరం గీతం భారతీయుల హృదయాల్లో దేశప్రేమను రగిలించిన ఉద్యమ నినాదమని పేర్కొన్నారు. వందేమాతరం గీత రచయిత బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో ఈ గీతాన్ని రాశారని, “వందే మాతరం” అంటే మాతృభూమికి వందనం అని అర్థమని తెలిపారు.

వందేమాతరం గీతం బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటంలో కోట్లాది భారతీయుల్లో దేశభక్తి జ్వాలలు రగిలించిందని స్రవంతి గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు స్మారకోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏటీపీ రేఖ, ఉపాధ్యాయులు, పీడీ, పీఈటీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు రాచకొండ కమిషనరేట్‌లో వందేమాతర గీతం 150 ఏళ్ల వేడుకలు
మల్కాజ్గిరి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు) వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ పోలీస్...
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సామూహిక వందే మాతరం గానం
అమ్మపల్లి ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు, గ్రీన్ బోర్డులు పంపిణీ
నాగారం మున్సిపాలిటీలో  వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు 
కాజీపేట్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఘనంగా వందేమాతరo గీతా లాపన
నాగారం మద్యం దుకాణం పై రగడ
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం