కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 

భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

కార్తీక పౌర్ణమి కీసరగుట్ట ఆలయాన్ని సందర్శించిన రాచకొండ సీపీ 

కీసర, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు)

కార్తీక పౌర్ణమి పర్వదినం కావడంతో కీసరగుట్ట శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ స్వయంగా పర్యటించారు.ఆలయ ప్రధాన ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, అడవి మార్గాలు, గోపురం చుట్టుపక్కల ప్రాంతాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. భక్తులు సౌకర్యవంతంగా ద‌ర్శనం చేసుకునేందుకు, ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు.సీసీ కెమెరాల పనితీరు, డ్రోన్ పర్యవేక్షణ, క్యూలైన్ మేనేజ్మెంట్, మహిళ భద్రత, ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ లైన్ల ఏర్పాట్లపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడం దృష్ట్యా అదనపు పోలీసు బలగాలు, శిక్షణ పొందిన సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ ను కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు.భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా పర్వదినాన్ని జరుపుకునేలా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. భక్తుల సహకారంతో వాహనాలను క్రమబద్ధంగా పార్క్ చేయాలని, అనుమతి లేని ప్రాంతాల్లో వాహనాలు నిలిపివేయరాదని సూచించారు.ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాలు చక్కగా కొనసాగుతున్నాయని సీపీ అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .