శిథిలావస్థలో మద్దిగట్ల పల్లె దావఖాన
రెండేళ్లయిన ప్రారంభానికి నోచుకోని పల్లె దావఖాన నూతన భవనం
Views: 5
On
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని పల్లె దావఖాన ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దావఖాన ప్రాంగణం అపరిశుభ్రంగా మారిపోవడంతో రోగులు అక్కడ చికిత్స కోసం రావడానికే భయపడుతున్నారు.
గత ప్రభుత్వ కాలంలోనే నూతన భవనం నిర్మాణానికి మంజూరు లభించినప్పటికీ, బిల్లులు మంజూరులో జాప్యం కారణంగా నిర్మాణం మధ్యలో దాదాపు 80% భవనం పూర్తయిన ఫలితంగా, కొత్త భవనం రెండేళ్లుగా పూర్తి కాకుండా అలాగే వదిలేయబడింది.నూతన భవనాన్ని వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని, రోగుల సౌకర్యార్థం అవసరమైన వసతులు కల్పించి వాడుకలోకి తీసుకురావాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Nov 2025 22:13:14
-ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో సహస్ర బిల్వార్చన, మహా రుద్రాభిషేకం
ఎల్కతుర్తి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో కార్తీక పౌర్ణమి...


Comments