సత్తుపల్లి రాజీవ్ నగర్‌లో మైనర్ బాలుడు అదృశ్యం

సత్తుపల్లి రాజీవ్ నగర్‌లో మైనర్ బాలుడు అదృశ్యం

.సత్తుపల్లి, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ 11వ రోడ్‌లో నివాసముండే 15 ఏళ్ల గువ్వల రమణ, 8వ తరగతి విద్యార్థి, గత నాలుగు రోజులుగా కనిపించడంలేదు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన రమణ, తన అమ్మమ్మ గువ్వల సావిత్రి సంరక్షణలో పెరిగాడు.

పండుగ సందర్భంగా రాజీవ్ నగరంలో బతుకమ్మ వేడుకలలో డీజే ఏర్పాటు చేశారు. వేడుక ముగిసిన తర్వాత, డీజేకు సంబంధించిన వ్యక్తులు రమణ ఇంటికి వచ్చి, డీజే బాక్స్‌ల కోసం 9,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

అవసరం అయిన సంతకాలను పెట్టకపోతే రమణను హిజ్రాల వద్దకు తీసుకెళ్ళి ఇంజక్షన్ ద్వారా పనికిరాని వ్యక్తిగా చేస్తామని బెదిరించారు.

బెదిరింపుని భయపడి రమణ నాలుగు రోజులుగా ఇంటికి రాలేదని, గువ్వల సావిత్రి సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, బాలుడిని వెతికే చర్యలు ప్రారంభించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .