వేంసూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

వేంసూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

 రైతు సంక్షేమమే లక్ష్యం.
- ఎమ్మెల్యే మట్టా రాగమయి .

సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా వేంసూరు మండలంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వేంసూరు మేజర్ పంచాయతీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు.

రైతుల సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం సన్న రకం వరి క్వింటాకు ₹2,389, దొడ్డు రకం వరి క్వింటాకు ₹2,369 చెల్లించనున్నట్లు తెలిపారు. అదనంగా సన్న రకానికి క్వింటాకు ₹500 బోనస్ అందించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజమైన మద్దతు ఇస్తోందని అన్నారు.

రైతుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి కృషి వల్ల ఈ పథకం అమలు సాధ్యమైందని రాగమయి తెలిపారు.WhatsApp Image 2025-11-01 at 6.40.01 PM

ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారులు, ఏపీఎం, ఏఈఓలు, పోలీస్ అధికారులు, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .