వేంసూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

వేంసూరులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

 రైతు సంక్షేమమే లక్ష్యం.
- ఎమ్మెల్యే మట్టా రాగమయి .

సత్తుపల్లి, నవంబర్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా వేంసూరు మండలంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వేంసూరు మేజర్ పంచాయతీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు.

రైతుల సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం సన్న రకం వరి క్వింటాకు ₹2,389, దొడ్డు రకం వరి క్వింటాకు ₹2,369 చెల్లించనున్నట్లు తెలిపారు. అదనంగా సన్న రకానికి క్వింటాకు ₹500 బోనస్ అందించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజమైన మద్దతు ఇస్తోందని అన్నారు.

రైతుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి కృషి వల్ల ఈ పథకం అమలు సాధ్యమైందని రాగమయి తెలిపారు.WhatsApp Image 2025-11-01 at 6.40.01 PM

ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారులు, ఏపీఎం, ఏఈఓలు, పోలీస్ అధికారులు, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!