నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!

విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన అతిథులు.

నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!

సత్తుపల్లి, నవంబర్‌ 2 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి నారాయణ పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో సమావేశం (ఎస్‌ఎల్‌సి) ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ రామదేవి హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రత్యేక అతిథిగా ఏజీఎం రాంకీ పాల్గొని విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.


WhatsApp Image 2025-11-02 at 7.17.25 PMఈ సందర్భంగా విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని స్వయంగా వివరించి, తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకున్న విషయాలను ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, సంభాషణ మరియు ప్రదర్శన సామర్థ్యాలు పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని అతిథులు తెలిపారు.

విద్యార్థులు తమ బలహీనతలను గుర్తించి, అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ఈ సమావేశం సాయపడుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ముగ్గురి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌డి విభాగాధిపతి స్వాతి లక్ష్మి, సమన్వయకర్త వినోద, ఆర్‌ఐ క్రాంతి కుమార్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ప్రధానోపాధ్యాయులు రామమూర్తి మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో నేర్చుకునే తపనను పెంచి, భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగడానికి దోహదం చేస్తాయి అని అన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .