ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులు సమర్పించిన: ఎమ్మెల్యే జారె.

ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులు సమర్పించిన: ఎమ్మెల్యే జారె.

అశ్వారావుపేట, అక్టోబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కృషి కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం స్వీకరించిన 120 దరఖాస్తులను సంబంధిత అధికారులకు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్రగామిగా ఉంటుందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కుటుంబం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉపశమనాన్ని పొందేలా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే జారె తెలిపారు.

అలాగే వైద్య చికిత్స అవసరమున్న ప్రతి అర్హత కలిగిన కుటుంబం తమ వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అందజేయాలని సూచించారు. వారికి ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్య సహాయం అందేలా తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .